GDWL: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. టూరిజం పాలసీలో 27 స్పెషల్ టూరిజం ప్రాంతాలను ప్రభుత్వం రాష్ట్రంలో గుర్తించిందన్నారు. అందులో గద్వాల జిల్లా ఉందన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఐ డెక్ ఆర్కిటెక్చర్ ప్రతిపాదనలపై గురువారం ఐడీఓసీలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.