PDPL: జిల్లాలో ఇవాళ నిర్వహించిన పదవ తరగతి సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 99.9% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి శారద ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 7489 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 7480 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 9 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.