MDK: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ కొద్దిరోజులుగా సమ్మె చేస్తుండగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు టెంట్ తొలగించారు. సీఎం పర్యటన భద్రతా కారణాల పేర్లు చెప్పి దౌర్జన్యంగా సమ్మె చేస్తున్న టెంటు శిబిరాన్ని తొలగించడంపై మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు ఖండించారు.