MDK: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను మహిళా గ్రూపుల సభ్యులకు మాత్రమే పంపిణీ చేయడాన్ని నిజాంపేట (M) బచ్చురాజ్పల్లిలోని పలువురు మహిళలు వ్యతిరేకించారు. ఈ విషయంపై పంపిణీ కేంద్రం వద్ద గొడవకు దిగారు. గ్రూపుల మహిళలు ఓటేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందా అని ప్రశ్నించారు. BRS ప్రభుత్వ హయాంలో అందరికి చీరలు ఇచ్చారని ఈ ప్రభుత్వం కూడా అందరికి చీరలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.