KRNL: కైరుప్పుల గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల రచ్చబండలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సోమవారం పాల్గొన్నారు. ప్రజలు పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకూడదని డిమాండ్ చేస్తూ, ప్రతి ఇంటిని సందర్శించి సంతకాలు సేకరించాలని సూచించారు.