RR: చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున మైనారిటీ సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ సోదరులకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు.