HNK: జిల్లా కోర్టు రెండు కీలక కేసుల్లో కఠిన తీర్పులు వెలువరించింది. పర్వతగిరి (M)లో దోపిడీకి పాల్పడిన ఐదుగురు నేరస్తులకు 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన జోసెఫ్ తంబికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. నేరాలు రుజువు కావడంతో న్యాయమూర్తులు ఈ తీర్పులు ఇచ్చారు. బాధితులు హర్షం వ్యక్తం చేశారు.