నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని మన్ననూర్ రేంజ్ పరిధిలో ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం లింగమయ్య జాతరకు సంబంధించి అధికారిక ట్రెకింగ్ మ్యాప్ను అటవీ శాఖ శనివారం విడుదల చేసింది. మన్ననూర్ గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఫరహాబాద్ గేట్, దోరియాల జంక్షన్, పుల్లపల్లి బేస్ క్యాంప్ మీదుగా రాంపూర్ పెంట వరకు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.