MHBD: నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ సింగారం నాగేంద్ర ప్రసాద్- స్వర్ణలత దంపతుల కుమారుడు సింగారం దీక్షిత్ 9వ తరగతి చదువుతున్నాడు. నిన్న జరిగిన శ్రీరామనవమి పండుగ సందర్భంగా తన చిత్రకళను ప్రదర్శించి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి చిత్రాలను చిత్రకరించి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. దీక్షిత్ను పలువురు అభినందిస్తున్నారు.