MLG: మేడారం సమ్మక్క పూజారి రాణా రమేష్ కుమారుడు ప్రమాదవశాత్తు గాయపడి హన్మకొండలోని గార్డియన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క బుధవారం ఆసుపత్రికి వెళ్లి బాధితుడుని పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. మంత్రి వెంట DCC అధ్యక్షుడు అశోక్ తదితరులు ఉన్నారు.