MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం (21) హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. భక్తులు స్వామివారికి, అమ్మవారికి సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ క్రమంలో స్వామి వారి హుండీ ఆదాయము రూ.23,17,756 రాగా, అమ్మవారి హుండీ ఆదాయము రూ.7,05,042 వచ్చింది. మొత్తం రూ. 30,22,798 వచ్చినట్లు అధికారులు తెలిపారు.