SDPT: ప్రజలందరూ వాహనం నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే సురక్షితంగా ఉండగలుగుతామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇవాళ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొల్చారం మండలంలో నిర్వహించిన అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.