ASF: కౌటాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మొత్తం 13 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జనరల్ విభాగంలో 200 మందికి గాను 195 మంది హాజరు కాగా, ఐదుగురు రాలేదు. ఒకేషనల్ విభాగంలో 114 మందికి, 106 మంది పరీక్ష రాయగా, 8 మంది గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.