HYD: RTC MD సజ్జనార్ కొత్త సైబర్ మోసాలపై ప్రజలను అలర్ట్ చేశారు. నేరగాళ్లు పిల్లలు ప్రమాదానికి గురయ్యారని తల్లిదండ్రులను మోసం చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. లింకుల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండి అనుమానాస్పద కాల్స్, లింకులను నమ్మవద్దని సూచించారు. కాగా కొంతకాలంగా ఇలాంటి వాటిపై సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.