JN: విజయా డెయిరీ ద్వారా సేకరించే పాల కొనుగోలు ధరలను త్వరలోనే పెంచనున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి వెల్లడించారు. HYDలో జరిగిన సమావేశంలో జనగామ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ సింగ్తో కలిసి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మార్చి బడ్జెట్లో పాడి పశువుల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.