VKB: ఎండల వేడిమితో పాఠశాల విద్యార్థులు తట్టుకోలేరని ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 16 నుంచి ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నామని ఎంఈవో అభిబ్ హమద్ తెలిపారు. కుల్కచర్ల మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. ఈనెల 14 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు.