SRPT: గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, ట్రాక్టర్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులకు గాయాలు కాగా, స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే బ్రిడ్జి వద్ద వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.