MNCL: స్కిల్ ఇండియా పోటీల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థి ఎర్రం శ్రీరామ్ ప్రతిభ చాటారు. హైదరాబాద్లో జరిగిన దేశవ్యాప్త స్కిల్ డెవలప్మెంట్కు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ తరపున వడ్రంగి రంగంలో ప్రాతినిధ్యం వహించిన శ్రీరామ్ ప్రథమ స్థానంలో విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి వివేక్ ప్రశంస పత్రంతో శ్రీరామ్ను సత్కరించారు.