VKB: కరెంట్ షాక్తో మహిళా మృతి చెందిన ఘటన యాలాల మండలం రాస్నంలో జరిగింది. గ్రామానికి చెందిన మక్త శశికళ (36) అనే మహిళ ఇంట్లో నీళ్లు పడుతుండగా వైర్ తాకడంతో కరెంట్ షాక్ తగిలి మరణించింది. ఇంట్లో ఎర్త్ లేకపోవడం, గోడలకు నీటి చెమ్మ పట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. శశికళకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. చిన్నారులు తల్లిని కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతుంది.