MDK: మాసాయిపేట మండలం రామంతపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా చిత్తుబొత్తు ఆటపై పోలీసులు దాడి చేసి కేసులు నమోదు చేశారు. చిత్తు బొత్తు ఆట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 24,570 లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో నలుగురు వ్యక్తులు పారిపోయారని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.