NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి ZPHSలో ఎన్పీ ఫౌండేషన్ పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు రూ.5,116 నగదు బహుమతిని ప్రకటించారు. ఫౌండేషన్ ఛైర్మెన్, సెక్రెటరీ తన్నీరు నిర్మలాదేవి, రాం ప్రభు విద్యార్థులకు ఇవాళ రాత సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు పాఠశాలకు కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రంలో హెచ్ఎం రమాదేవి, నర్సింగ్ రాజు, చిట్టిబాబు పాల్గొన్నారు.