SRPT: జిల్లా విద్యాశాఖ కార్యాలయ ‘పీఎం శ్రీ’ విభాగానికి ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయనున్నట్లు డీఈవో అశోక్ ఈరోజు తెలిపారు. ఇందులో భాగంగా ఐ-5 కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, అల్మారాలు, సోఫా సెట్లను సమకూర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల సరఫరాదారులు తమ కొటేషన్లను ఈ నెల 28వ తేదీనా జిల్లా కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.