KNR: ఇల్లందకుంట మండల ప్రజలు రాత్రిపూట ఇళ్ల తలుపులు, కిటికీలు బాగా లాక్ చేసుకోవాలని ఇల్లందకుంట SI క్రాంతి కుమార్ సూచించారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో అంతరాష్ట్ర దొంగలు ఒకే రోజు 9 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.