మంచిర్యాల: బెల్లంపల్లిలోని కాల్ టెక్స్ బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని యువకుడి మృతదేహాం లభ్యమైనట్లు రైల్వే ASI మోహన్ రాథోడ్ తెలిపారు. వారికి అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడు రడగంబాల బస్తికి చెందిన యువకుడిగా గుర్తించారు. సుమారు 23 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.