మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సింధు కాన్ఫరెన్స్ హాల్ వేదికగా ఈ నెల 22న ఉగాది పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాతెలుగుతల్లి ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధి శ్రీనివాసయ్య తెలిపారు. ఈ ఉత్సవాలకు బెంగళూరు నుండి ప్రత్యేక అతిథులు విచ్చేస్తున్నారని, పాలమూరు జిల్లా వాసులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.