సత్యసాయి: బుక్కపట్నం మండలం రాసింపల్లి వద్ద సిద్ధరాంపురంలో చెరువుకు వెళ్లే కల్వర్టును మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. వర్షపు నీరు సాఫీగా బయటకు వెళ్లేలా అక్కడ కొత్త కల్వర్టును నిర్మించాలని మండల నాయకులు ఆయనకు సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన మాజీ మంత్రి, కల్వర్టు నిర్మాణానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.