JGL: జగిత్యాల మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి మల్లేశం-గంగాలక్ష్మీ దంపతుల కుమారుడు రాహుల్ సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచాడు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఆయన 748వ ర్యాంక్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు ఆయన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.