NGKL: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి “వుషూ” క్రీడా పోటీల్లో పీఎంశ్రీ ప్రభుత్వ హైస్కూల్ అచ్చంపేట విద్యార్థి శివప్రసాద్ పాల్గొని ద్వితీయ స్థానం సాధించాడు. పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాల, అచ్చంపేటకు కీర్తి తీసుకొచ్చాడు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.