SRD: ముత్తంగి శివారులో NH-65 వద్ద పోలీసులు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి ముంబైకు DCM వాహనంలో 6 కేజీల ఎండు గంజాయి తరలిస్తుండగా SI ఆసిఫ్ బృందం పట్టుకుంది. నిందితుల నుంచి గంజాయి, DCM వాహనం, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.13.30 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం కాగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.