MHBD: పట్టణంలో గురువారం ఉదయం పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాలు, గంజాయి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, మత్తు పదార్థాల వినియోగం దృష్టికి వస్తే తమకి తెలియజేయాలని, మున్సిపల్ సిబ్బందిని, ప్రజలను కోరారు.