JN: రఘునాథపల్లిలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు హాజరయ్యారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని అన్నారు.