ADB: తాంసి మండలంలోని గిరిగాం గ్రామంలో ఆదిలాబాద్ MP గోడం నగేశ్ బుధవారం రాత్రి పర్యటించారు. గ్రామ సర్పంచ్ దారట్ల ఉత్తం తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నగేశ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మండల BJP నాయకులు, స్థానికులు తదితరులున్నారు.