NGKL: జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా గోదాము వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని, నిత్యం అప్రమత్తంగా పర్య వేక్షించాలని అక్కడి భద్రతా సిబ్బందిని ఆదేశించారు.