MDK: రాష్ట్రంలోని 5,008 అంగన్వాడీలను ‘సక్షం’ పథకంతో కేంద్రం ఆధునికీకరించనుంది. ఇందులో మెదక్ (130), సంగారెడ్డి (298) కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో డిజిటల్ విద్య కోసం LED స్క్రీన్లు, మెరుగైన మౌలిక వసతులు మరియు నాణ్యమైన పోషకాహారం అందనున్నాయి. ఈ మార్పులతో అంగన్వాడీలు కార్పొరేట్ తరహాలో బలోపేతం కానున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.