SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. రోడ్డుపై పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.