KNR: ప్రభుత్వం రైతుభరోసా కింద 9 రోజులలో రూ.9,000 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయడం పట్ల చొప్పదండిలో కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గానికి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పాలాభిషేకం చేశారు. రైతుల పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.