WNP: మదనాపురం మండలం దంతనూరు గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణయ్య అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న ప్రజావాణిలో ఉండడంవల్ల రాలేకపోయానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృష్ణయ్య చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.