SDPT: బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్ణయించుకుని కష్టపడి చదివితేనే విజయాన్ని సాధించగలమని సూచించారు.