NLG: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయని, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఇవాళ ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.