KNR: తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామివారి కిరీటం, అమ్మవారి ఆభరణాలను అపహరించారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షలపైనే ఉంటుందని అర్చకులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరిస్తున్నారు.