WGL: నల్లబెల్లి మండలంలోని 29 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నేడు నిర్వహించనున్న గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MPDO శ్రీనివాసరావు తెలిపారు. గ్రామ సభల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామ అభివృద్ధి పనులపై సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు చర్చించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.