MDK: పొలానికి వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన రామాయంపేటలో జరిగింది. సదాశివ్ నగర్ తండాకు చెందిన జాట్రోత్ హనుమంతు శనివారం రాత్రి తన పొలానికి వెళ్లాడు. పొదల్లో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా రైతుపై దాడి చేసింది. దీంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.