JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో మూడు దశాబ్దాల తర్వాత చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. స్థానిక శ్రీ కల్యాణ రామచంద్రస్వామి ఆలయ నూతన కమిటీని గ్రామస్థులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 30 ఏళ్లుగా సాధ్యపడని ఈ ఐక్యత, ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో గ్రామస్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆలయ కమిటీ అధ్యక్షుడిగా అనంతుల భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా గడ్డం గంగాధర్ ఎన్నికయ్యారు.