NLG: ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఆసరా పెన్షన్లను వెంటనే అమలు చేయాలని KVR దివ్యాంగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమేష్ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల పెన్షన్లను పెంచుతామనడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, వెంటనే కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ఆయన కోరారు.