KMM: చంద్రగ్రహణం సందర్భంగా ఖమ్మం నగరంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ అధికారులు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం తెరుస్తామని ఈవో కొత్తూరు జగన్మోహన్ రావు తెలిపారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేశాక 10 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.