KNR: కరీంనగర్ రూరల్ పరిధిలో దుర్షేడ్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును పోలీసులు గురువారం పట్టుకున్నారు. గోపాలపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా తనిఖీలు చేపట్టగా, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న పొన్నం లక్ష్మణ్, బిజిలి చందులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులను కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు