MNCL: చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, చెల్లించవల్సిన మొత్తం చెల్లించాలని జిల్లా జడ్జి నిరోష తీర్పునిచ్చారు. 2018లో జైపూర్ మండలంకి చెందిన నరసింహారెడ్డి వద్ద మంచిర్యాలకు చెందిన మధుసూదన్ రూ. 7.75 లక్షలు అప్పు చేశాడు. తిరిగి చెల్లించే క్రమంలో చెక్కు ఇవ్వగా అది బౌన్స్ అయ్యింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగాపై విధంగా తీర్పునిచ్చారు.