SRCL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యదర్శి ఎండి. అఖిల్ పాషా శుక్రవారం ప్రకటించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా రిక్కమల్లె మనోజ్, జనరల్ సెక్రటరీలుగా మందా మనోహర్, గొల్లపల్లి మహిపాల్, మహిళా అధ్యక్షురాలిగా కాలికోట రేణుక నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి చురుగ్గా కృషి చేయాలని ఆయన సూచించారు.