SRPT: మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద తిరుమలగిరి మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసింది. ఈ పథకం కింద వాటర్ ట్యాంకులు, సంపులు, పైపులైన్లు నిర్మించాల్సి ఉంది. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 2024 జూన్లో ఈ పథకం ప్రారంభమైనా.. నేటికి పనులు పూర్తి కాలేదు. దీంతో వేసవిలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు.