HNK: చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి మాతృమూర్తి చంద్రకళమ్మ ఇటీవల మరణించగా ఆమె చిత్రపటానికి మంత్రి కొండా సురేఖ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు ఉన్నారు.